Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ప్ర‌ముఖ సాహితీవేత్త‌, మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ఒకానొక స‌మ‌యంలో టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చీపురు ప‌నిచేసేందుకు కూడా సిద్ధ‌పడ్డార‌ట‌. ఈ మాట‌లు ఎవ‌రో చెప్పిన‌వి కావు. స్వ‌యాన యార్ల‌గ‌డ్డ లక్ష్మీ ప్ర‌సాద్ చెప్పిన‌వే. ఇంత‌కీ ఆయ‌న చీపురు ప‌నిచేసేందుకు కూడా సిద్ధ‌ప‌డేలా చేసింది ఎవ‌రో కాదండి బాబూ.. స్వ‌యాన ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడే. త‌న‌కు ఆ ప‌రిస్థితి వ‌చ్చేందుకు దారితీసిన కార‌ణాల‌ను ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ..
ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు, హ‌రికృష్ణ‌కు మంచి సంబంధాలు ఉండేవ‌న్నారు. అయితే, 1995లో ఎన్టీఆర్ నుంచి.. చంద్ర‌బాబు అక్ర‌మంగా ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ చంద్ర‌బాబుకు త‌న మ‌ద్ద‌తు తెలిపారు కూడా. అయితే, ఆ త‌రువాత త‌న‌కు కానుక‌గా చంద్ర‌బాబు రాజ్య‌స‌భ ఇచ్చాడంటూ ప‌లు ప‌త్రిక‌లు వార్త‌ను ప్ర‌చురించాయని, అదంతా అవాస్త‌వ‌మ‌ని చెప్పుకొచ్చారు ల‌క్ష్మీ ప్ర‌సాద్‌. ఆనాడు త‌న‌కు ప‌ద‌వి ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిరాక‌రించ‌డంతో హ‌రికృష్ణ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇప్పించార‌న్నారు. అయితే, ఆ త‌రువాత రెండో ట‌ర్ములో హ‌రికృష్ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిరాక‌రించార‌న్నారు. హ‌రికృష్ణ ప‌ద‌విలో లేకుండా నేను ప‌ద‌విలో ఉటే మంచిది కాదు.. నేను ఆఫీసు ఊడ్చే ఉద్యోగం చేయమన్నా చేస్తా నంటూ త‌న మ‌న‌సులోని మాట‌ను చంద్ర‌బాబు ముందు పెట్టాన‌న్నారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ని, ఇక అప్ప‌ట్నుంచి త‌న‌కు, చంద్ర‌బాబుకు మధ్య బాగా గ్యాప్ పెరిగిందని ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు యార్ల‌గ‌డ్ల ల‌క్ష్మీ ప్ర‌సాద్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat