తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి.
అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. ఇటీవల ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ.. తన స్కిట్లలో అతని పోట్ట బట్ట పై పంచ్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో లైవ్ డిబేట్లో మహేష్ కత్తి అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక గుడ్లు తేలేశాడు. ఇక ఆ తర్వాత అనాథల పై పంచ్లు వేయంతో ఏకంగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్కే వెళ్ళింది. ఇలా వరుసగా ఆది తన పంచ్లతో బుల్లితెరను మొత్తం బూతు తెరగా మారుస్తున్నాడు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. జబర్ధస్థ్ తాజా ప్రోగ్రాంలో హైపర్ ఆది వెబ్ సైట్ల పై వేసిన పంచ్లపై వెబ్ మీడియా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రోమోలో భాగంగా ఆది పంచ్ వేస్తూ.. మనం ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారని అనగా.. తోటి లేడీ కమెడియన్ వెబ్సైట్లంటే ఎందుకు అంత భయపడుతారని అడుగ్గా.. వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారని.. మొన్న మా ఫ్రెండ్ సుబ్బారావుకి గొడతగిలి కన్నుమూసుకుపోగా.. సుబ్బారావు కన్నుమూత అని వెబ్సైట్లో రాశారని దిక్కుమాలిన పంచ్ ఒకటి పేల్చాడు.. దీంతో వెబ్ మీడియా వాళ్ళు హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ టైమ్లోనే ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసరికి ఆదికి దిక్కుతోచడంలేదని.. దీంతో ఏకంగా మీడియా పైనే సెటైర్లు వేస్తున్నాడని.. త్వరలోనే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడని వెబ్ మీడియా జనం ఫైర్ అవుతున్నారు.