వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 3.30 గంటలకు పాదయాత్ర పెడబల్లి మీదుగా ప్రారంభమై బలిజపల్లిలో ముగుస్తోంది. సాయంత్రం 5 గంటలకు బలిజపల్లి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు.