ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పార్టీ చేసే తరాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్ లపై ఏకంగా ధ్వజమెత్తారు. ప్రస్తుతం సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన ప్రకటించారు.