Home / ANDHRAPRADESH / ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…

ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…

దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప‌డుతున్న నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న  చంద్రబాబు భేటీ జ‌ర‌గనుందని స‌మాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు  ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు .
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు మూడు రోజుల్లో సమావశమై అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇరువురి భేటీ ఈ నెల 12న జరగనుంది. ఈ భేటీలో పోలవరం, రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశారు, నవ్యాంధ్రరాజధానికి ఆర్థిక చేయూత తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat