ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందనే విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు.ఏపీలో అమలవుతున్న 80 శాతం పథకాలకు కేంద్రం నిధులిస్తుందని, అయినా రాష్ర్ట ప్రభుత్వం ఆ పథకాలకు నిధులు అందించడం లేదని పురందీశ్వరి మండిపడ్డారు.
టీడీపీ ఇలానే వ్యవహరిస్తే ..2019 ఎన్నికల్లో రాష్ర్టంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకిగా మారాయని చెప్పారు.