ఇటివల ఏకంగా దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఉందా ..?.ఇటివల మీడియా ముందుకొచ్చి నలుగురు ప్రధాన న్యాయమూర్తులు చేసిన ఆరోపణలలో నిజముందా ..?అంటే అవును అనే అంటున్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ .
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో మీడియాతో అయన మాట్లాడుతూ దేశాన్నే కుదిపేసిన మెడికల్ కళాశాల స్కాం లో భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పాత్ర ఉంది అని ఆయన ఆరోపించారు .ఈ వ్యవహారం మీద లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు .అంతే కాకుండా జస్టిస్ చలమేశ్వర్ చేసిన ఆరోపణలకు ఆయన మద్దతు తెలిపారు ..