తెలంగాణ దశ, దిశను మార్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు గుప్పించారు. అంతరాష్ట్రీయ నదుల అనుసంధానం కార్యక్రమం లో కాళేశ్వరం పై చర్చించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా కితాబు ఇచ్చారు. రైతుల, సాగునీటి అవసరాలు తీర్చేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరు ఉంటుందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి కొనియాడారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి గడ్కరీ కితాబు ఇచ్చారు. వేగవంతంగా కొనసాగుతున్న పనుల తీరును మంత్రి అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల తీరును పరిశీలించేందుకు కేంద్ర మంత్రి, జలవనరుల శాఖ కార్యదర్శిని రాష్ట్రానికి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు తెలుసుకునేందుకు వస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.