తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గత పాలకులే హైదరాబాద్ మహానగరాన్ని నాశనం చేశారు అని సవివరంగా వివరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చాలా బాధించాయి.అయితే ఏపీ ప్రజలు ఏమి చేయలేదు .అన్నిటికి గత పాలకులే ప్రధాన కారణం అని పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని ,హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి పేరిట సర్వనాశనం చేసింది చెప్పకనే చెప్పారు మీడియాతో .దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పటికైనా తెలంగాణ ,హైదరాబాద్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది తామే అని చంద్రబాబు ఒప్పుకున్నారు అని సెటైర్లు వేస్తోన్నారు .