ప్రస్తుత సమాజంలో ఆడవారికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడ చూసిన కానీ మహిళలపై అత్యాచారాలు ,లైంగిక దాడులు ,హత్యలు జరుగుతూనే ఉన్నాయి .దేశ వ్యాప్తంగా నిమిషానికి ఇద్దరో ముగ్గురు మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే అంశం అందర్నీ తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.చట్టాలు ఎన్ని మారిన ..పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలను అరికట్టలేకపోతున్నారు .
అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన యావత్తు సభ్య సమాజాన్నే తలదించుకునే అంత పని చేసింది ..మొన్న మంగళవారం పదహారు తారీఖున జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో కోలార్ కు చెందిన ప్రభాకర్ భార్య నిండు గర్భిణి .ఆమెకు సహాయంగా ఉంటుందని తనకు వరసైన చెల్లె 16 ఏళ్ళ వయస్సున్న యువతిని వెంటపెట్టుకొని తన అత్తగారింటికి వచ్చింది .అయితే ఒకవైపు భార్య గర్భిణి కావడంతో ఆమె భర్త కన్ను తన భార్యకు చెల్లి వరసైన యువతిపై పడింది.
అంతే రాత్రిపూట ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి తలుపులు వేసి మరి అత్యాచారానికి పాల్పడ్డాడు.అయితే ఈ విషయం బయటచేప్పితే ఎక్కడ తన పరువు పోతుందేమో అని భయపడిన నిండు గర్భిణి బయటచేప్పొద్దు అని తన చెల్లిని వేడుకొంది.అయితే అనారోగ్య పాలైన సదరు యువతిని తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చింది సదరు యువతి.దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు .దీంతో పోలీసులు కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు .