Home / ANDHRAPRADESH / కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..

కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..

ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.

అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు నుండే ఎందుకు మొదలెట్టనున్నారు అని ప్రశ్నలకు జనసేన పార్టీ నేతలు మీడియాకు వివరించారు.అప్పటి ఉమ్మడి ఏపీలో తన అన్న ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట కొండగట్టు వెళ్ళిన పవన్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం హుస్నాబాద్ కు వెళ్లి ప్రచారరథం ఎక్కి మరి మాట్లాడుతుండగా బస్సు ముందుకు కదలడంతో ముందున్న 11 కెవి విద్యుత్ లైన్ ను ఆయన తాకడంతో కుప్పకూలిపోయారు.అయితే మొదట కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకోవడం వలన పెనుప్రమాదం నుండి బయటపడ్డాను అని పవన్ కళ్యాణ్ నమ్మడం వలన నేడు ఆయన ప్రజాయాత్రను కొండగట్టు నుండే మొదలెట్టారు అని వారు వివరించారు..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat