ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అరవై ఎనిమిది రోజులుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .
ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా చిత్తూరు లో తన పాదయాత్రకు అన్ని వర్గాల బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగిసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో నవ్యంధ్ర కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ కు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు .
అయితే తనపై గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రపూరితంగా పెట్టిన కేసులకు తాను ఎప్పటికి భయపడను ..చావనైనా చస్తాను కానీ విలువలకు తిలోదకాలు వదిలి నీచ రాజకీయాలు చేయను సంచలన వ్యాఖ్యలు చేశారు ..