ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా మొదటి రోజు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.రెండో రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు ,నేతలు ,అభిమానులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ,ప్రజాయాత్ర రూట్ మ్యాప్ గురించి చర్చించారు.మూడో రోజులో భాగంగా పవన్ ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.ఉదయం భద్రాది-కొత్తగూడెం నుండి బయలుదేరిన పవన్ కాన్వాయ్ ఖమ్మం జిల్లాలో తల్లాడకు చేరుకుంది.
అక్కడకి చేరుకోగానే పవన్ ఓపెన్ టాప్ కార్లో నిలబడి ప్రసంగిస్తుండగా కొంతమంది చెప్పులతో దాడులు చేశారు.అయితే వెంటనే తేరుకున్న పవన్ వ్యక్తిగత భద్రతాసిబ్బంది పవన్ పై దాడిని అడ్డుకున్నారు.పవన్ పై జరిగిన దాడిని నెటిజన్లు ఖమ్మం జిల్లాలో తల్లాడలో పవన్ కు చెప్పులతో స్వాగతం పలికారు అని సెటైర్లు వేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి .