ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటివల మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేరిస్తే బీజేపీ పార్టీతో కల్సి పని చేయడానికి తాము సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెల్సిందే.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీకి చెందిన నేతల నుండి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.
బీజేపీ పార్టీ నుండి మంత్రిగా పనిచేస్తున్న మాణిక్యాల రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షంగా ఉన్నాయి.కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలంగానే ఉంది.అయితే తమ పార్టీ జాతీయ అధిష్టానం ఎవరి మద్దతును కోరడంలేదు .ఒకవేళ మద్దతు ఇస్తామంటే వద్దు అని అనము అని ఆయన అన్నారు .
మరోవైపు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తాం అని అనడం రాజకీయ వ్యభిచారమే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలచేత రాజీనామా చేయిస్తా అని చెప్పిన జగన్ ముందు ఆ పని చేయాలనీ ఆయన సూచించాడు .