ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ .
అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ అనే వ్యక్తి.అందులో భాగంగా ఈ లఘుచిత్రం గురించి ప్రతి మాట ,ట్రైలర్ లో వచ్చిన హీరోయిన్ డైలాగ్స్ అన్ని ఉన్న స్క్రిప్ట్ ను సరిగ్గా మూడు యేండ్ల కిందట అంటే 2015 ఏఫ్రిల్ 1న రాంగోపాల్ వర్మకు పంపాను .
కానీ ఆయన నుండి ఎటువంటి స్పందన లేదు .స్పందన లేకపోగా తను రాసిన కథను చిత్రంగా తీసి విడుదల చేస్తున్నాడు అని కోర్టులో పిటిషన్ వేశాడు.దీంతో స్పందించిన కోర్టు వర్మకు నోటీసులు పంపింది.అయితే ప్రస్తుతం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల పలు మహిళ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో వర్మ విడుదల చేస్తారా లేదా అని ఆలోచనలో ఉన్నారు వర్మ అభిమానులు .