Home / ANDHRAPRADESH / ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..

ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు అయిన నందమూరి బాలకృష్ణ వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని ఆరోపణలు వస్తున్నాయి.

ఇటివల విజయవాడలో సచివాలయంలో హిందూపురం నియోజక వర్గ అభివృద్ధి ,లేపాక్షి ఉత్సవాల గురించి బాలయ్య నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగిన సంగతి తెల్సిందే.ఈ సమావేశంలో బాలయ్య సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూర్చునే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సమీక్ష జరిపిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం మీద ఇంట బయట ఆఖరికి పచ్చ మీడియాలో కూడా పలు కథనాలు కూడా ప్రసారమయ్యాయి .ఈ తరుణంలో అనంతపురం జిల్లాలోని రెండు ఎత్తిపోతల పథకానికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి అనుకూలంగా ఆ శాఖ మంత్రి చేత ఆదరబాదరంగా రెండు జీవోలను విడుదల చేయించారు.

యాబై తొమ్మిది ,అరవై నెంబర్లతో ఉన్న ఈ రెండు జీవోలతో వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి ఒక్కరోజే బాలయ్య ప్లాన్ చేశాడు అని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ చేశారు.అయితే ఇదే వార్తను ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు తన బావ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుర్చీని అడ్డుపెట్టుకొని ఒక్కరోజే వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు అని ఆరోపిస్తున్నారు.అయిన ఒక ఎమ్మెల్యే ..ఎటువంటి ప్రోటోకాల్ లేని బాలకృష్ణ ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం వెనక బాలయ్య అంతర్యం ఏమిటో ఆ సమావేశంలో పాల్గొన్నవారికి ..చిన్నబాబు లోకేష్ ..పెద్దబాబు చంద్రబాబుకే తెలియాలని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat