Home / ANDHRAPRADESH / ఏపీ ప్రజల తలరాత మార్చే సత్తా ఉన్న నేత జగన్ ..టీడీపీ కేంద్ర మాజీ మంత్రి..

ఏపీ ప్రజల తలరాత మార్చే సత్తా ఉన్న నేత జగన్ ..టీడీపీ కేంద్ర మాజీ మంత్రి..

ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర పడిన ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సాయిప్రతాప్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ముక్కుసూటిగా సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రుల చేత ..ఎంపీల చేత నిధులు తెప్పించేవాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.ఎటువంటి బెదిరింపులకు ..అక్రమ కేసులకు భయపడటం వైఎస్సార్ రక్తంలోనే లేదు.ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా వైఎస్సార్ అకాలమరణం చెందటం వలన ఆయన తనయుడు ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమకేసులను బనాయించారు.

అయిన కానీ వెనకడుగు వెయ్యకుండా జగన్ సోనియాను ఎదిరించి పార్టీను పెట్టి గత ఏడేండ్లుగా పార్టీను నడిపిస్తున్నారు .ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రజల తలరాతను మార్చాలన్న ..కేంద్రాన్ని ఎదిరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ,విభజన చట్టంలో హామీలను నేరవేర్చేలా చేయగల సత్తా ఉన్న నేత జగన్ ..అప్పట్లో వైఎస్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని అధికారాన్ని చేపట్టారు .తాజాగా జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో జగన్ కూడా అలాంటి ముద్ర వేసుకోవడం ఖాయం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే గత కొంతకాలంగా వైసీపీలోకి వస్తారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో బాబు సొంత మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన చేరిక దాదాపు ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat