సినిమాల పరంగా మేము పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది.
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన అనుచర వర్గంతో నిర్వహించిన సర్వేలో ఏపీలో టీడీపీకి 21 సీట్లు మాత్రమే వస్తాయని, ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. జనసేన అనుచరవర్గం చేసిన ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లుతోపాటు 54 శాతం ఓట్లు వస్తాయని తేలింది. టీడీపికి 30 శాతం, జనసేనకు 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సర్వేతో రాజకీయ పార్టీలో చర్చ మొదలైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుట్టుచప్పుడు కాకుండా చేయించిన సర్వే ఇప్పుడు బయటకు రావడంతో జనసేనాని అభిమానులను నిరాశ చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేసి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, పలు పార్టీలు చేస్తున్న సర్వేల్లో వైఎస్ జగన్కు అనుకూలంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన అనుచరవర్గంతో చేయించిన తాజా సర్వేలోనూ అదే రిపీటైంది. దీంతో పవనే మా హీరో… జగనే మా నాయకుడు అన్న.. పవన్ కల్యాణ్ అభిమానుల అన్న మాటలు మరోసారి రుజువయ్యాయి.