శనివారం మొదలైన ఈ సీజన్ ఐపీల్ -2018 వేలం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో మొదట వేలంలోకి వచ్చిన తోలి ఆటగాడు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ను రూ 5.2 కోట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకున్నది .దావన్ తర్వాత టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విండిస్ ఆటగాళ్ళు కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వచ్చారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ప్రపంచంలోనే అత్యంత టీ20 విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన క్రిస్ గేల్ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్ ఈ ఏడాది మాత్రం రూ.12.5 కోట్లకే రాజస్థాన్ రాయల్స్ స్టోక్స్ను సొంతం చేసుకుంది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగడం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి వేలంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టి పోటీ ఇస్తోంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.7.6కోట్లతో దక్కించుకుంది.వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ను రూ.5.4 కోట్లకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.