Home / ANDHRAPRADESH / బాహుబ‌లి పోస్ట‌ర్‌ని బీట్ చేసేలా ఉన్న జ‌గ‌న్ వ‌దిలిన ఒకే ఒక్క పోస్ట‌ర్.. టీడీపీకి ఎక్క‌డో మండిపోతుందా..?

బాహుబ‌లి పోస్ట‌ర్‌ని బీట్ చేసేలా ఉన్న జ‌గ‌న్ వ‌దిలిన ఒకే ఒక్క పోస్ట‌ర్.. టీడీపీకి ఎక్క‌డో మండిపోతుందా..?

ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా బిసిల ఓట్లు తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ ఈ ఫార్ములాని అప్లై చేసినట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికలలో బీసీలకు ఎక్కువశాతం సీట్లు కేటాయిస్తాని జగన్ ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఎన్నికలలో బీసీల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో జగన్ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్ బీసీలపై వరాల‌ జల్లులు కురిపిస్తున్న తరుణంలో అధికార పార్టీ డిఫెన్స్ లోకి వెళ్లడం ఖాయమ‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో కులం ఆధారంగా రాజకీయం షురూ కావడంతో ఏపీలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కడం ఖ‌యామ‌ని బాహుబ‌లి పోస్ట‌ర్‌కు మించి జ‌గ‌న్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపుతోంద‌ని దీంతో టీడీపీ ఎక్క‌డ బ‌డితే అక్క‌డ మండిపోవ‌డం ప‌క్కా అని రాజ‌కీయ విశ్లేష‌క‌లు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat