Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజీనామా..!!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజీనామా..!!

టీడీపీ నాయ‌కుల భూ దాహానికి అంతులేద‌ని మ‌రోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణిపై భూ క‌బ్జా కేసు న‌మోద‌వ‌డ‌మే. కేసు న‌మోదైంది బోండా సుజాత‌పైనే అయినా వెన‌కుండి న‌డిపించింది మాత్రం బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావేన‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఒక ఎమ్మెల్యేకు త‌న భార్య ఏం చేస్తుంద‌న్న‌ది తెలియ‌ద‌న‌డం అతిశ‌యోక్తి కాదేమో..!!

see also : 2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..కేటీఆర్

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆ పార్టీ నాయ‌కుల నుంచే ఘోర అవ‌మానాల్ని ఎదుర్కొంటున్నారు. ఏకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫోన్ చేసి మ‌రీ చీవాట్లు పెట్టిన‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా పోయి పోయి ఓ స్వాతంత్ర్య యోధుడి భూమిపై ఎలా క‌న్నేశావ‌య్యా..? అంటూ ప్ర్రశ్నించిన‌ట్లు స‌మాచారం. త‌న భార్య‌పై భూ కబ్జా కేసు న‌మోదు కావ‌డంతో త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రుగుతున్న అధికారిక కార్య‌క్ర‌మాల్లో కూడా ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు పాల్గొన‌కుండా ముఖం చాటేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే చిన్నారి సాయిశ్రీ సెల్ఫీ వీడియో ఎఫెక్ట్ నుంచి కోలుకోక ముందే.. మ‌ళ్లీ భూ క‌బ్జా కేసులో ఇరుక్కోవ‌డంతో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట బోండా ఉమా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat