ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది.
అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో మరిన్ని నిధులతో పాటుగా ప్రత్యేక ప్యాకేజీ ,రైల్వే జోన్ పై ప్రకటన ఉంటుందని ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు భావించారు .అయితే బడ్జెట్ ప్రసంగం మొదలెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక్కడ కూడా ఏపీకి ప్రత్యేక నిధుల విషయం మీద కానీ రైల్వే జోన్ మీద ఎటువంటి ప్రకటన చేయకుండా ఏపీ ప్రజలకు బిగ్ షాకిచ్చారు .