కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిరోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఒకవైపు ఆ పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ ..రైతు హిత బడ్జెట్ అంటూ ఉదరగోట్టిన కానీ ఏకంగా అధికారంలో ఉన్న రాజస్తాన్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు ప్రజలు .
అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అత్యంత కీలక ప్రాంతాలైన అజ్మేర్ ,ఆళ్వార్ జరిగిన ఉప ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను ,ఒక అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది .అయితే ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు ..
ఆళ్వార్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి జశ్వంత్ యాదవ్ పై కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ ఒక లక్ష యాబై ఆరు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు .మందల్ గడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధకద్ బీజేపీ అభ్యర్థి పై పదమూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు .. అజ్మేర్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది ..