తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మరో ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకటవీరయ్య కాంగ్రెస్ గూటికి చేరాలని ప్రణాళికలు వేస్తున్నాడు.మరో ఎమ్మెల్యే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టె యోచనలో ఉన్నారు .
తాజాగా టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఇ పెద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయిన ఆర్ సి కుంతీయ తో భేటీ కానున్నారు అని వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఆయన కుంతీయతో భేటీ అయిన తర్వాత టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని ఆయన అనుచరవర్గం భావిస్తుంది