Home / NATIONAL / 2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!

2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు .

కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో ప్రశంసించారు .లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ రైతులపై ప్రశంసల వర్షం కురిపించారు.ఉత్పత్తి ధరకంటే 1.5రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు మంత్రి ప్రకటించారు .అయితే వ్యవసాయరంగ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చే విధంగా రూ.ఐదు వందల కోట్లతో హరిత ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు .

మరో నాలుగు ఏండ్లు అంటే 2022 ఏడాది కల్లా దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన వివరించారు.అంతే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఏకంగా నిధులను ఏడు వందల కోట్ల నుండి పద్నాలుగు వందల కోట్లకు పెంచినట్లు ప్రకటించారు .రైతాంగానికి మేలు చేసేవిధంగా కార్పస్ ఫండ్ కోసం రెండు వేల కోట్లను కేటాయించనున్నట్లు కూడా తెలిపారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat