ఐపిఎల్ వేలంపాట జరిగినప్పుడు గతంలో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మాత్రమే అక్కడ సెంటారఫ్ అట్రాక్షన్గా ఉండేది. ఈ సొట్టబుగ్గల సుందరి చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసేది. అయితే 2018 ఐపిఎల్ వేలంలో మాత్రం ఆమెకు పోటీగా మరో సుందరి అందరినీ ఆకట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొని ఆటగాళ్ల గురించి డిస్కస్ చేస్తూ, కొంటూ, పోటీ పడుతూ చాలా బిజీబిజీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి, ఎవర్రా ఈ అమ్మాయి అంటూ అందరూ ఆరా తీశారు.
అయితే ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. బాలీవుడ్ బ్యూటీ జూహీచావ్లా అందరికీ తెలిసే ఉంటుంది. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్కు షారుఖ్తో పాటు, జూహీ కూడా ఒక యజమాని. జుహీ చావ్లా – నిర్మాత జయ్ మెహతాల కూతురు అయిన జాన్వీ మెహతా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకుంది. వేలం పాటలో యాక్టివ్గా ఉండడంతో జాన్వీ పై అందరూ ఎక్కువగా ఫోకస్ చేశారు. క్రికెట్ అంటే జాన్వికి చిన్నతనం నుంచీ చాలా ఇష్టమట. అందుకే చాలా ఆసక్తిగా కేకేఆర్ స్టాఫ్తో కలిసి ఈ వేలంలో పాల్గొంది. ఇన్నాళ్లూ ఐపిఎల్ వేలంలో ప్రీతిజింతా, జూహీ చావ్లా తమ జట్లను ప్రోత్సహించడం చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఐపీఎల్లో తల్లితో కలిసి జాన్వి కూడా మ్యాచ్ లకు వస్తుందో.. లేక కేవలం బిడ్డింగ్కే పరిమితమవుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఐపిఎల్ బడా బాబుల కన్ను జాన్వీ పై పడిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.