తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ ( గురువారం ) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.అలాగే కొత్తగా నిర్మించిన గ్రామా పంచాయతీ భవనం,ప్రాధమిక వ్యవసాయ సహకారా సంఘ భవనం ను ప్రారంబించారు.అనంతరం డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీ లించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మోడల్ గ్రామ పంచాయతీ భవనం ముస్తాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే కొత్తపంచాయతీరాజ్ చట్టం రాబోతున్నది. దీనితో సర్పంచులకు నిధులు, విధులు, బాధ్యతలు మరింత పెరుగుతాయని వెల్లడించారు.ముస్తాబాద్లో 8 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఇచ్చినా అంతిమంగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, అధికారులే కీలకమన్నారు.
Minister @KTRTRS inaugurated the newly constructed Gram Panchayat building at Mustabad village in Rajanna Sircilla District today. pic.twitter.com/zIWuT4OSp7
— Min IT, Telangana (@MinIT_Telangana) February 1, 2018