ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని తేల్చేశారు. పాదయాత్రలో బాగంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వైఎస్ జగన్ .
see also…2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయని పేర్కొన్న జగన్.. ఆ ఎన్నికల్లో పవన్, మోదీ కలిసి ప్రచారం చేశారని అన్నారు. వారిద్దరు కలిసి ప్రచారం చేసినా టీడీపీకి అధికంగా వచ్చింది ఐదు లక్షల ఓట్లేనని తెలిపారు. కాని నేను ఒక్కడినే అన్ని సీట్లు ఎలా వచ్చాయో అది మీకు కూడ తెలుసు… 2019 లో అదేమా బలం…ముగ్గురు కలిసిన ఏపీ ప్రజలకు న్యాయం చేయ్యలేక పోయారు…ప్రజలు నేను చేయ్యగలను అని నమ్ముతున్నారు..కనుక 2019 లో ఖచ్చితంగా గెలిచి…ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఈ మాటలు విన్న వైసీపీ నాయకులు ఆనందంతో ఈ మాటలను తెగ షేర్లు చేసుకుంటున్నారు.