ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.
See Alsoబ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
ఈ క్రమంలో నిరుద్యోగ యువత ,విద్యార్ధి విద్యార్థినులు ,మహిళలు ,వృద్ధులు ,రైతులు జగన్ ను కల్సి తమ గోడును చెప్పుకుంటున్నారు.తాజాగా నెల్లూరు లో పాదయాత్రను నిర్వహిస్తున్న జగన్ ను భారీగా నిరుద్యోగ యువత కల్సి అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ చదువుకున్న చదువుకు ఉద్యోగం లేక కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం అని తెలిపారు.
దీనికి స్పదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా నిరుద్యోగ యువతకు అండగా ఉండటానికి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.జగన్ మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సుల వలన మన ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత జరిగే మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం అమలు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు .