ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి .
See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…
తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అధిత్యనాథ్ పై సీబీఐ మోపిన అక్రమకేసును ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టేసింది.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరించారు అని ఈడీ పలు కేసులను నమోదు చేసింది .
ఈ కేసుపై విచారణ అనంతరం ఉమ్మడి హైకోర్టు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఐఏఎస్ అధికారిపై మోపిన కేసులన్నీ అక్రమకేసులు అని తేల్చేసి కొట్టేసింది .అయితే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మోపిన పలు అక్రమ కేసుల్లో ఒకదాని తర్వాత ఒకటి వీగిపోతుండటంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ..