టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది.
అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన సంగతి తెల్సిందే.దీంతో గంగూలీ సారధిగా చేసిన పదకొండు శతకాల రికార్డును విరాట్ సమం చేశాడు .అయితే ఇప్పటివరకు గంగూలీ ,విరాట్ మినహా టీం ఇండియా వన్డే కెప్టెన్ గా ఉన్న ఎవరు ఇన్ని శతకాలను బాదలేదు .అయితే దాదా మొత్తం నూట నలబై రెండు ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధిస్తే విరాట్ మాత్రం కేవలం నలబై ఒక్క ఇన్నింగ్స్ లో బాదేశాడు ..