ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్బై చెప్పి..టీఆర్ఎస్ పార్టీ లోకి చేరనున్నారు .ఈ విషయాన్నీ స్వయంగా ఇవాళ అయన మీడియాకు వెల్లడించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు. అయితే ప్రస్తుతం భిక్షం.. తుంగతుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. కాగా జీడీ భిక్షం చేరికతో సూర్యాపేట లో బీజేపీ పార్టీ మరింత పతనం దశకు చేరిందని వార్తలు వస్తున్నాయి.
see also : అండర్ -19 టీమ్కు ప్రముఖుల అభినందనల వెల్లువ..!
see also : శృంగార పాఠాలు నేర్పించి.. రూ.40 కోట్లు సమర్పించుకున్నాడు..!!
see also :బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!