ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. అంతేకాక.. 2019లో అధికారంలోకి వచ్చే పార్టీ వివరాలు, ఎన్నిసీట్లు, ఎక్కడెక్క డ. ప్రజల ఆదరణ ఎవరిపై ఉంది అన్న అంశాలపై జరిగిన ఈ సర్వేలో సీఎం ఎవరో కూడా తేలింది.
నారా లోకేష్ సర్వేలో టీడీపీతోపాటుగా పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఈ విషయం నాడు పవన్ కల్యాణ్ సర్వేలో తేలగా.. నేడు నారా లోకేష్ సర్వేలో అదే తేలడం విశేషం.
నారా లోకేష్ తన అనుచర వర్గంతో నిర్వహించిన సర్వేలో ఏపీలో టీడీపీకి 21 సీట్లు మాత్రమే వస్తాయని, ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లుతోపాటు 60 శాతం ఓట్లు వస్తాయని తేలింది. టీడీపికి 24 శాతం, జనసేనకు 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సర్వేతో రాజకీయ పార్టీలో చర్చ మొదలైంది.
నారా లోకేష్ గుట్టుచప్పుడు కాకుండా చేయించిన ఈ సర్వే ఇప్పుడు బయటకు రావడంతో టీడీపీ నేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు నిరాశ చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేసి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, పలు పార్టీలు చేస్తున్న సర్వేల్లో వైఎస్ జగన్కు అనుకూలంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు నారా లోకేష్ తన అనుచరవర్గంతో చేయించిన తాజా సర్వేలోనూ అదే రిపీటైంది.