భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్ 19 ఆటగాళ్ల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది….అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు. మరో ఆటగాడు (హోల్ట్) రనౌట్ గా వెనుదిరిగాడు.
ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది నిలకడగా సాగుతున్న ఆసీస్ బ్యాట్స్ మన్లను భారత బౌలర్లు ఒక్కసారిగా దెబ్బకొట్టారు. చివర్లో 5 వికెట్లను ఆస్ట్రేలియా జట్టు త్వరగా కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్మెన్ లలో ఉప్పల్ 34 పరుగులు, ఎడ్వర్డ్స్ 28, షరమ్ స్వీనే23 పరుగులతో ఫర్వాలేదనిపించారు. 217 విజయ లక్ష్యంతో టీమిండియా మైదానంలోకి దిగింది..ప్రస్తుతం 4 ఓవర్లకు 23 స్కోరు…వికెట్ నష్టపోకుండ..కాని వర్షం కారణంగా మ్యాచ్ ప్రస్తుతం నిలిపేశారు…!