ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనమవుతున్న కానీ పట్టించుకోవడంలేదు .రాష్ట్రానికి ఒక అసమర్థ నేత ప్రధాన ప్రతిపక్షగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు ..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఇంతవరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం చాలా దారుణం అని ..అసలు ఇది యావత్తు తెలుగు జాతికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు .అయితే తనపై ఉన్న కేసుల నుంచి బయట పడే తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఆయనకు శ్రద్ధ లేదని ఆయన ఎద్దేవా చేశారు.