2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఏజెన్సీల ద్వారా చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సర్వేపై మనమూ ఓ లుక్కేద్దాం..!!
ముందుగా
కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 2
చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 6
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 10
టీడీపీ : 4
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 6
నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 6
టీడీపీ : 4
గుంటూరు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 12
టీడీపీ : 5
కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అదులో
వైసీపీ : 12
టీడీపీ : 4
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ : 10
టీడీపీ : 5
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ : 13
టీడీపీ : 6
విశాఖపట్నం జిల్లాలో..
వైసీపీ : 10
టీడీపీ : 5
విజయనగరం జిల్లాలో
వైసీపీ : 6
టీడీపీ : 3
శ్రీకాకుళం జిల్లాలో
వైసీపీ : 7
టీడీపీ : 3
ప్రకాశం జిల్లాలో
వైసీపీ : 10
టీడీపీ : 2
కాంగ్రెస్ అధ్యక్షుడు రా హుల్ గాంధీ సర్వే ఫలితాల ప్రకారం 175 సీట్లు ఉన్న ఏపీలో 110 వైఎస్ఆర్సీపీ, 55 టీడీపీకే అన్న వాస్తవం బట్టబయలైంది. ఇప్పటికే వైఎస్ జగన్ కాబోయే సీఎం అంటూ జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పై ఫలితాలు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా రావడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో వ్యతిరేకత, అలాగే, ప్రత్యేక హోదా అంశంపై పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతూ ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల మధ్యన ఉంటున్న జగన్కు.. ప్రజాదారణ పెరిగిందని రాహుల్ గాంధీ సర్వేలో తేలినట్లు సమాచారం. జనసేనకు ఒక్క సీటు కూడా రాకపోవడం కొసమెరుపు.