Home / SLIDER / సత్తా చాటిన ఓపెనర్‌ స్మృతి..

సత్తా చాటిన ఓపెనర్‌ స్మృతి..

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఉమెన్స్ ఇండియా జట్టు భారీ స్కోర్ ను సాధించింది.జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తొంబై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ఎనబై నాలుగు పరుగులను సాధించడంతో మొత్తం యాబై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి రెండు వందల పదమూడు పరుగులు చేసింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.మొదటి వికెట్కు యాబై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.ఈ క్రమంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్ అయిన ఓపెనర్‌ స్మృతి మంధాన (84) మరోసారి వీరోచిత బ్యాటింగ్‌ కు తోడుగా పూనమ్‌ రౌత్‌ (19; 47బంతుల్లో 2×4) అండగా నిలిచింది.

కుదురుకున్న ఈ జోడీని 14.6వ బంతికి పూనమ్‌ను ఔట్‌ చేయడం ద్వారా అయబొంగ విడదీసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సారథి మిథాలీ (45; 70 బంతుల్లో 2×4)తో కలిసి మంధాన అదే జోరును కొనసాగించింది. వేగంగా పరుగులు చేసింది. చివర్లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (16; 33 బంతుల్లో 1×4), సుష్మ వర్మ (15; 21 బంతుల్లో 1×4) నిలకడగా పరుగులు సాధించడంతో భారత్‌ 213 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టులో మరిజానె, అయబొంగ తలో రెండు వికెట్లు తీశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat