భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే మిస్టర్ కూల్.. కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా ఓపెనర్ మర్క్రమ్ (32) క్రీజు వెలుపలికి వెళ్లాడు.అయితే బంతి అతని బ్యాట్కి అందకుండా.. నేరుగా వెనక్కి వెళ్లింది. క్షణాల వ్యవధిలో బంతిని అందుకున్న ధోని బెయిల్స్ని ఎగరగొట్టేశాడు. ఈ స్టంపౌట్తో ధోని వికెట్ల వెనకన ఉండి 400 మందిని పెవిలియన్కు పంపించిన ఘనత సాధించాడు.
అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు ధోని 314 వన్డేల్లో 399 డిస్మిసల్స్ చేశాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భువీ బౌలింగ్లో హషీమ్ ఆమ్లాను క్యాచ్ అవుట్ చేసి కీపర్గా 399వ వికెట్ సాధించాడు. ఇందులో 294 క్యాచులు, 105 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో నాలుగో వికెట్ కీపర్గా ధోని ఘనత అందుకున్నాడు. ధోనికి ముందు ఈ ఘనత సాధించిన వారిలో కుమార సంగక్కర (482), గిల్క్రిస్ట్ (472), బౌచర్ (424) ఉన్నారు. మూడో వన్డేలోనే మిల్లర్ క్యాచ్ని కూడా ధోని అందుకోవడంతో ఔట్ల సంఖ్య 401కి చేరింది.
see also..తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు