ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు.
See Also:ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..?
నాడు రాష్ట్ర విభజన చేసిన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదానిస్తాం కేంద్ర సర్కారు సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించింది.ఆ సమయంలోనే ప్రస్తుత అధికార విపక్షాలు హామీ ఇచ్చాయి.గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తుత అధికార పార్టీ హామీ కూడా ఇచ్చింది.
See Also:మరోసారి తండ్రి కోడుకుల(బాబు,లోకేష్ ) కు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే
నాడు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమయ్యాయి అని ఆయన ఆరోపించారు. కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారా ..ఇప్పటివరకు ప్రజలకు ఏమి ఇచ్చారు …ఏమి చేశారో చెప్పాలని జగన్ చంద్రబాబు ను నిలదీశాడు ..