తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు సోమవారం హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటి చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన మరోసారి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము ..రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని ఆయన అన్నారు .
see also : మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …!