Home / SLIDER / విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలి-ఎమ్మెల్యే సతీష్ కుమార్

విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలి-ఎమ్మెల్యే సతీష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ చిగురు మామిడి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరోరా డిగ్రీ కళాశాల కరీంనగర్ ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక క్యాంపు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక సేవను ప్రశంసించారు.

విద్యార్థుల కృషి అభినందనీయమని, విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియ జేయాలని అన్నారు. విద్యార్థులు గ్రామాల పై, ప్రజల జీవనంపై అవగాహన కలిగిఉండాలని అన్నారు. తెలుగు తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు.

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో పాఠశాల అదనపు గదులకు ప్రారంభోత్సవం చేసారు. ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat