ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు.
ఈ క్రమంలో ప్రస్తుతం మేయర్ గా ఉన్న శ్రీధర్ ను వెంటనే తప్పించాలని తెలుగు తమ్ముళ్ళు ఏకంగా పార్టీ అధిష్టానానికి లేఖాస్త్రాన్ని సంధించారు.అయితే మేయర్ పై తిరుగుబావుటా ఎగురవేసిన కార్పోరేటర్లకు స్థానిక ఎమ్మెల్యే (విజయవాడ తూర్పు) గద్దె రామ్మోహన్ అండగా నిలిచారు అని బెజవాడ రాజకీయాల్లో టాక్.
కానీ మరో వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర మంత్రి ,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తో కల్సి మేయర్ శ్రీధర్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు అని కార్పోరేటర్ల ప్రధాన ఆరోపణ.అయితే ఒకపక్క తెలుగు తమ్ముళ్ళు మరోపక్క తన తనయుడితో కల్సి అవినీతి అక్రమాలు చేస్తున్న మేయరు ..ఎవరికీ సర్ది చెప్పాలో అర్ధం కాక చంద్రబాబు నాయుడు విజయవాడ అర్భన్ టీడీపీ అధ్యక్షుడు అయిన బుద్దా వెంకన్నకు తగిలించారు అంట .చూడాలి మరి తెలుగు తమ్ముళ్ళు మున్ముందు ఎలా ఉంటారో ..? ..