అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. మర్జోరీ స్టోన్మన్ డగ్లస్ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్ల్యాండ్లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.నిందితుడిని అదే స్కూల్కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్ క్రూజ్ (19)గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పార్క్ల్యాండ్లోని మార్జోయ్ స్టోన్మన్ డగ్లస్ హైస్కూల్లో బుధవారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. దుండగుడు లోపలికి వస్తూనే గేటు దగ్గర ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ వెంటనే బిల్డింగ్ ఫైర్ అలారంను మోగించాడు. ఆ శబ్ధానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా ఒక్కసారిగా బయటికి వచ్చేప్రయత్నం చేశారు. అప్పుడా దుండగుడు ద్వారానికి ఎదురుగా నిలబడి.. బయటికి వచ్చినవారిని వచ్చినట్లు కాల్చిపారేశాడు. ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు.
అయితే డగ్లస్ స్కూల్లో కాల్పులకు పాల్పడిన టీనేజర్ను నికోలస్ క్రూజ్(19)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. నికోలస్ కూడా అదే స్కూల్ విద్యార్థి అని, కొద్ది రోజుల కిందటే అతను సస్పెండ్ అయ్యాడని తెలిపారు. కాల్పుల అనంతరం స్కూల్లోనే నక్కిఉన్న నికోలస్ను పోలీసులు బంధించారు. సస్పెండ్ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.