తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంమే ముఖ్య కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఇ-ట్రియో.. అయితే ఈ కంపెనీ వచ్చే కొన్ని నెలల్లోనే రెండు నూతన ఎలక్ర్టిక్ కార్లను మార్కెట్లోకి తెచ్చే అందుకు ప్లాన్ చేస్తుంది. ఈ రెండు కార్ల (హ్యాచ్బ్యాక్, సెడాన్) ప్రొటోటై్పలను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది. హైదరాబాద్ నగరం శివారులోని బొల్లారంలో ఎలక్ర్టిక్ కార్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేశామని, నెలకు 1,500 కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉందని ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సత్య యలమంచిలి తెలిపారు.
see also : ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు..!
150 పేరుతో హ్యాచ్బ్యాక్..ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్లు, 180 పేరుతో సెడాన్ కారు.. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే180 కిలో మీటర్లు ప్రయాణించనున్నట్టు ఆయనతెలిపారు . భారత్, అమెరికాలోని ఒరిజినల్ ఎక్వి్పమెంట్ మాన్యుఫ్యాక్చరర్లతో టైఅప్ కుదుర్చుకున్నామని తెలిపారు.చైనా, తైవాన్లోని పవర్ ట్రెయిన్ సప్లయర్లతోనూ ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో సుమారు 300 కార్లను విడుదల చేసే యోచనలో ఉన్నామని అయన తెలిపారు. కార్లకు వినియోగిస్తున్న బ్యాటరీలు 30 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం చార్జింగ్ అవుతుందని చెప్పారు .
see also : ఒక అమ్మాయి కోసం ఇద్దరు… ప్రేమదేశం సినిమా కంటే..అంతకు మించిన ప్రేమకథ