వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై తీసుకున్న సంచలన నిర్ణయంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా తప్ప వేరే ఆఫ్షన్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై కేంద్రం తేల్చకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అందుకోసం ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ ఇవ్వడంతో రాజకీయ వాతావరంణం మస్త్ వేడెక్కింది.
అయితే జగన్ నిర్ణయం మాత్రం కేంద్రానికి ఎఫెక్ట్ ఎంతో తెలియదు గానీ.. ఏపీ అధికార టీడీపీకి మాత్రం దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో ముందుగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎక్కడ క్రెడిట్ జగన్కి వెళ్లి.. జనాలు ఉమ్మేసి.. చీపుర్లు తిరగేసి కొడతారో అని రాజీనామాలే శరణ్యమని తెలుగు తమ్ముళ్లు భావించడమే కాకుండా.. తెగ తర్జన భర్జనలు పడుతున్నారని టీడీపీ వర్గాల్లో లీకులు మొదలయ్యాయి.
అయితే ఈ నేపధ్యంలో ముందుగా కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయించాలని.. కేంద్రమంత్రులుగా ప్రస్తుతం సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు ఇద్దరితో ముందుగా రాజీనామా చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు బావిస్తున్నట్టు సమాచారం. అయినా కేంద్రం దిగిరాకపోతే అవసరమైతే ఎంపీలచేత కూడా రాజీనామా చేయించి ప్రజలకి కలరింగ్ ఇవ్వాలని చంద్రబాబు గ్యాంగ్ స్కెచ్ వేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ఇచ్చిన డెడ్లైన్ దెబ్బకి టీడీపీ బ్రదర్స్ మొత్తం డిఫెన్స్లో పడిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.