ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యాక జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో జరుగుతున్న ప్రత్యేక హోదా రగడ పై మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే ఉపయోగమేంటంటూ జగన్ పై సెటైర్లు వేసిన జేసీ.. కొన్నాళ్ళ క్రితం ఏపీ ఎంపీలంటే కూరలో కరివేపాకుల్లా కనిపిస్తున్నారని తన పై తానే కరివేపాకు సెటైర్ వేసుకున్నారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ఎంపీ లను అసలు లెక్క చేయట్లేదని… మిత్రపక్షం అయినా తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడంలేదని… అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అసలే లెక్క లేదట. అయితే ఇలాంటి మాటలన్నీ బాగానే చెబుతున్న జేసీ బ్రదర్.. ఇన్ని అవమానాలు పడుతున్నప్పుడు.. ఇంకా కరివేపాకులాంటి ఎంపీ పదవిని ఓ పట్టుకుని వేలాడడం ఎందుకో అంటే మాత్రం నోట్లో నుండి మాట రాదు. ఏపీ ఎంపీలకు పార్లమెంటులో తగిన గౌరవం లేనప్పుడు.. ఇంకా ఆ పదవిని పట్టుకుని ఎందుకు వేలాడడం ఎందుకు.. మగాడిలా తన ఎంపీ పదవికి రాజీనామా చేసొచ్చి… తన హీరోయిజం ఏంటో చూపించవచ్చు కదా… అయితే అలాంటి సిసలైన రాజకీయాలు మాత్రం చెయ్యరు. ఎందుకంటే మిస్టర్ కరివేపాకు జేసీకి ఎంపీ పదవి అంటే అంత ఇష్టం, అంతకన్నా అవసరం కూడా. మైకు దొరికినప్పుడల్లా నోటికొచ్చిన కూతలు కూయడం కాదు.. పదవుల్ని పట్టుకుని వేలాడే మీలాంటి వారికి వాస్తవాలెలా తెలుస్తాయని రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పింస్తున్నారు. దీంతో ఈ జేసీ బ్రదర్ ఏం మాట్లాడినా.. హాట్ జోక్ అనిపిస్తుందే తప్ప, ఏదో సీరియస్ మ్యాటర్గా అనిపించదు. అయితే ఇక్కడు ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే.. జేసీ పేల్చే జోకులకి నవ్వు మాత్రం అసలు రాదండోయ్.