వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్రత్యేకహోదా రగడ జరుగుతున్నవిషయం తెలిసిందే. దీంతో మొన్నటికి మొన్న రాజీనామా అస్త్రాన్ని కరెక్ట్ టైమ్లో జగన్ ప్రయోగించి.. చంద్రబాబు సర్కార్ని ఇరకాటంలో పడేశారు. జగన్ ప్రకటన దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధమంటూ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో జగన్ వదిలిన బాణం దెబ్బకి టీడీపీ నేతలు ఏ రేంజ్లో విలవిల లాడారో అర్ధం చేసుకోవచ్చు.
see also : తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!
అయితే టీడీపీ మొత్తం గ్యాంగ్ ఇంకా ఆ షాక్ నుండి తేరుకోకుండా.. తాజాగామరో షాక్ ఇచ్చారు జగన్. కేంద్రం పై అవిశ్వాసానికి తాము సిద్ధమని, దమ్ముంటే టీడీపీ ముందుకు రావాలని సవాల్ విసిరారు. దీంతో టీడీపీ తమ్ముళ్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. ప్రకాశం జిల్లా కందుకూరులో పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ… మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ తమకు మద్దతు ఇస్తుందా… అని జగన్ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం పై టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.
see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
ఇక ప్రధాని మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాన్ని పరిశీలించమని, పవన్ నేతృత్వంలోని సంయుక్త నిజనిర్థారణ కమిటీ స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం పై చంద్రబాబు సర్కార్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వైసీపీ మాత్రం ఛాలెంజింగ్గా తీసుకుని వెంటనే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీ అంటూ జగన్ పబ్లిక్గానే ప్రకటించడంతో మరో హాట్ టాపిక్ అయ్యింది. అయితే జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే టీడీపీ అవిశ్వాసం పెడతామని ప్రకటిస్తే మోదీకి కోపం వస్తోంది.. అలాగే అవిశ్వాసం పెట్టమని చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దమ్మెత్తి పోస్తారు. దీంతో టీడీపీ ప్రెజెంట్ పొజిషన్ బోనులో పడ్డ ఎలకలా తయారైంది. మరి చంద్రబాబు అండ్ కో.. ఎలా స్పందిస్తారో చూడాలి.