ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది.
- మామిడి పండులో ఉండే పోటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.ఇందులో ఉండే మిటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హనీ చేసే కొలెస్ట్రాలను తగ్గిస్తాయి.
- చిగుళ్ళ ఇన్ఫెక్షన్,రక్తంకరడం,పంటి నొప్పి వంటి సమస్యలు దూరం కావాలంటే మామిడి ముక్కలను నమలాలి.ఇలా చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది.
see also : మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
- మామిడి పండు మంచి జిర్ణకారి ,ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగ్గా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
- మామిడి పండును తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
- మామిడి పండులో ఐరన్ సంవృద్దిగా లబిస్తుంది.అందువల్ల రక్తహీనత సమస్యతో భాధపడే వారు మామిడి పండును తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
- మామిడి పండ్లలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్ధం సంవృద్దిగా ఉంది.అందువల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
see also :ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
- మామిడి పండ్లలో ఉండే మిటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది.
- మామిడి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కొన్ని రకాల కేన్సర్లు రాకుండా నిరోధిస్తాయి.పచ్చి మామిడి తినడం వలన ఉపిరితిత్తులు శుబ్రపడుతా యి.
- మామిడి పండును తినడం ద్వారా చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది.మెదడును ఆరోగ్యంతో ఉంచుతుంది.శృంగారెచ్చను పెంచుతుంది.
see also :పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు