తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు త్వరలో సన్నబియ్యంతో మంచి రుచికరమైన భోజనం అందించనున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.దీనికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారని త్వరలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.ఇవాళ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వారసత్వ జైలు మ్యూజి యం ముగింపు వారోత్సవాలకు మంత్రి నాయిని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లలో పదేండ్లు దాటి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాదికూడా జైళ్లల్లో మగ్గుతున్న 250మందిని విడుదల చేశామన్నా రు. సంగారెడ్డి జైలులోనే పురాతన కేరళ వైద్యా న్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. నూతనంగా ఆయుర్వేద విలేజ్ను ఏర్పాటు చేశామని, ప్రజలు తక్కువ ఖర్చుతో పురాతన వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.