ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది.
See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పలు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇంటర్వ్యూ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వీలుందా అని అడిగిన ప్రశ్నకు టీఎస్ఆర్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఆదరణ అత్యంత ఎక్కువగా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ప్రజాఆదరణ నిదర్శనం.ఎంత ప్రజాదరణ లేకపోతే పార్టీ పెట్టి అరవై ఏడుమంది ఎమ్మెల్యేలను,అంతమంది మంది ఎంపీలను ఎలా గెలిపించుకుంటాడు .ప్రస్తుతం జగన్ కు నలబై ఆరేళ్ళు .తప్పకుండ జగన్ సీఎం అవ్వడం ఖాతం అని ఆయన అన్నారు ..ఏపీ రాజకీయ భవిష్యత్తు జగన్ దే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also :హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు